లాక్డౌన్ నేపథ్యంలో గత 50 రోజులుగా రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కేంద్ర ఇచ్చిన సడలింపులతో సుదీర్ఘ విరామం తర్వాత రైల్వేశాఖ ప్రత్యేకంగా కొన్ని రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. దీనిలో భాగంగా బెంగళూరు నుంచి న్యూదిల్లీ వెళ్లే రాజధాని ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ చేరుకుంది.
సికింద్రాబాద్ చేరిన రాజధాని ఎక్స్ప్రెస్...కిటకిటలాడిన రైల్వే స్టేషన్ - కరోనా సమయంలో రైళ్లు
కేంద్ర ఇచ్చిన సడలింపుల మేరకు రైల్వేశాఖ తిరిగి రైళ్లను ప్రారంభించింది. దీనిలో భాగంగా బెంగళూరు నుంచి న్యూదిల్లీ వరకు వెళ్లే రాజధాని ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్కు చేరుకుని ప్రయాణికులతో వెళ్లింది.
సికింద్రాబాద్ చేరిన రాజధాని ఎక్స్ప్రెస్... బయలుదేరిన 288 ప్రయాణికులు
అక్కడి నుంచి 288 ప్రయాణికులు రాజధానిలో వెళ్లారు. ప్రతి ఒక్కరికి థర్మల్ స్క్రీనింగ్ చేసి... అనంతరం వారిని స్టేషన్లోనికి అనుమతించారు. పటిష్ఠ బందోబస్తు నడుమ రైళ్లను నడుపుతున్నారు.
ఇవీ చూడండి:ప్రజల ఆరోగ్యం కోసం కరోనాతో ఖాకీ యుద్ధం