తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉద్యానవనంలో వాన నీటిని ఒడిసిపడుతున్నారు

పార్కు అంటే ఆహ్లాదకరమైన చెట్లు, ఆట స్థలం ఇవే మనకు గుర్తొస్తాయి. మనం కూడా సేదతీరేందుకో, సరదాగా గడపడానికో పార్కుకు వెళ్తాం. కానీ హైదరాబాద్​ జూబ్లీహిల్స్​లో జలమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఉద్యాన వన ప్రాంగణం విజ్ఞానాన్ని పెంపొందిస్తోంది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో అంతంత మాత్రంగా కురిసిన వాన నీటిని ఒడిసిపట్టేలా అధికారులు తీసుకున్న చర్యలు సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నాయి.

By

Published : Jul 23, 2019, 3:26 PM IST

జస సంరక్షణ

హైదరాబాద్ జూబ్లీహిల్స్​లో ఏర్పాటు చేసిన వాన నీటి సంరక్షణ పార్కు అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రతి వర్షపు బొట్టును ఒడిసిపట్టేలా అధికారులు చర్యలు చేపట్టారు. వాన నీటి సంరక్షణతో పాటు... భవిష్యత్​ తరాలకు నీటి పొదుపు ఆవశ్యకతను తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. పార్కుకు వచ్చిన పిల్లలకు నీటి పాఠాలు చెబుతున్నారు. దీని కోసం ప్రత్యేకంగా వర్షపునీటి సంరక్షణ పద్ధతుల ఉద్యాన ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. నీటి పొదుపు గురించి వివరించేందుకు ఓ రోబోను సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. మొక్కల పెంపకంపై సందర్శకులకు అవగాహన కలిగించేలా ఏర్పాట్లు చేశారు. జలాన్ని సంరక్షించి... భూగర్భ జలాలు పెరిగేందుకు అధికారులు తీసుకుంటోన్న విధానాలపై ఈటీవీ భారత్ ప్రతినిధి​ కార్తీక్​ అందిస్తున్న కథనం...

ఉద్యాన వనంలో వాన నీటిని ఒడిసిపడుతున్న విధానం

ABOUT THE AUTHOR

...view details