తెలంగాణ

telangana

ETV Bharat / state

పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు... పట్టించుకోని ప్రజాప్రతినిధులు

హైదరాబాద్​లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నందున సరూర్​నగర్​ ప్రాంతంలో మ్యాన్​హోళ్లు పొంగిపొర్లగా స్థానికులు చాలా ఇబ్బంది పడ్డారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

By

Published : Sep 26, 2020, 10:51 PM IST

rain water into houses at saroornagar latest news
పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు... పట్టించుకోని ప్రజాప్రతినిధులు

హైదరాబాద్​ సరూర్​నగర్​ ప్రాంతంలో శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తూనే ఉంది. స్థానిక కోదండరాం నగర్​, సీ సిలస్, హనుమాన్​ నగర్ టెంపుల్, పద్మావతి కాలనీ ప్రాంతాల్లో మ్యాన్​హోళ్లు పొంగి పొర్లుతుండగా పలు కాలనీలు నీట మునిగాయి.

వర్షాల కారణంగా రాత్రి నుంచి ఇళ్లల్లోకి నీళ్లు వెళ్లగా స్థానికులు ఉదయం నుంచి ఇబ్బందులు పడుతున్నారు. తమకు తినడానికి భోజనం లేదని.. ఉద్యోగాలకు కూడా వెళ్లలేదని.. ఈ విషయమై స్థానిక కార్పొరేటర్​ కానీ, ఎమ్మెల్యే కానీ రాలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:ఆ రెండు రాష్ట్రాలకు బస్సులు నడిపేందుకు ప్రభుత్వం గ్రీన్​సిగ్నల్

ABOUT THE AUTHOR

...view details