తెలంగాణ

telangana

ETV Bharat / state

అత్యవసరమైతేనే ప్రయాణించండి: పీయూష్ గోయల్ - Piyush Goyal REVIEW on Corona Disease in Railways

కరోనాను ఎదుర్కోవడానికి రైల్వేశాఖ అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తి చెందకుండా పర్యవేక్షించేందుకు ఆన్​లైన్ డాష్ బోర్డు ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ సూచించారు.

RAILWAY MINISTER Piyush Goyal REVIEW on Corona Disease in Railways
అత్యవసరమైతేనే ప్రయాణించండి: పీయూష్ గోయల్

By

Published : Mar 19, 2020, 5:17 AM IST

Updated : Mar 19, 2020, 6:57 AM IST

కరోనా వైరస్ సోకకుండా రైల్వే శాఖ తరపున అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దేశంలోని అన్ని రైల్వే బోర్డు ఛైర్మన్, సభ్యులతో పాటు జనరల్​ మేనేజర్లు, డీఆర్​ఎంలతో దృశ్యమాధ్యమ సదస్సును నిర్వహించారు. వైరస్​ నియంత్రణకు అధికారులు చేపట్టిన చర్యలను ప్రశంసించారు. తక్షణం తీసుకోవలసిన చర్యలు, వాటి పర్యవేక్షణపై సూచనలు చేశారు.

రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులకు, వివిధ జోనల్ రైల్వేల అధికారులకు మధ్య సమన్వయం కోసం ఆన్​లైన్ డాష్ బోర్డులు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి సూచించారు. ప్రతి జోన్ నుంచి ఒక నోడల్ ఆఫీసర్ ఉండి కొవిడ్-19 వ్యాప్తి చెందకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రైల్వే బోర్డుతో సంప్రదిస్తూ ఉంటారని తెలిపారు. ప్రయాణికులు బయలు దేరేముందు తమకు జ్వరం లేదని నిర్ధారించుకోవాలని ఆయన తెలిపారు. అత్యవసరమైతేనే ప్రయాణం చేయాలని కోరారు.

ఇవీ చూడండి:సీతారాములను వదలని కరోనా.. కల్యాణంపై కొవిడ్​-19 ఎఫెక్ట్

Last Updated : Mar 19, 2020, 6:57 AM IST

ABOUT THE AUTHOR

...view details