కాంగ్రెస్, భాజపా ప్రభుత్వాలు కార్మికులకు ఇన్సెంటివ్స్, ప్రమోషన్స్ లేకుండా చేశాయని సౌత్సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జాతీయ కార్యదర్శి సీహెచ్ శంకర్రావు ఆరోపించారు. నూతన పింఛన్ విధానంతో కార్మికులు తీవ్రంగా నష్టంపోతున్నారన్నారు. పాత పింఛన్ విధానాన్ని ప్రవేశపెట్టే వరకూ పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే రైల్వే కార్మికుల సమ్మె తప్పదని హెచ్చరించారు. కేంద్రంలో అధికారంలోకి రాబోయే కొత్త ప్రభుత్వమైనా తమకు అండగా ఉంటుందని ఆశాభావం వ్యంక్తం చేశారు.
'స్పందించకపోతే రైల్వే సమ్మె తప్పదు'
కార్మికుల హక్కులను కాలరాస్తూ, చట్టాలను నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సౌత్సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జాతీయ కార్యదర్శి సీ హెచ్ శంకర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బోనస్ దినోత్సవం సందర్భంగా నాంపల్లి సౌత్ సెంట్రల్ రైల్వే యూనియన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
railway-mazdur-sangh