తెలంగాణ

telangana

By

Published : Aug 27, 2020, 2:36 PM IST

ETV Bharat / state

'ఆంధ్రా మద్యం తాగితే 2, 3 ఏళ్లకే హరీ అంటారు'

ఆంధ్రప్రదేశ్​లో మద్యం బ్రాండ్లపై ఎంపీ రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రాలో దొరికే మద్యం తాగినవారు 2, 3 ఏళ్లకే చనిపోయే అవకాశముందని నిపుణులంటున్నారని రాఘురామ కృష్ణరాజు అన్నారు.

raghu-rama-krishna-raju-on-liqour-brands-in-andhra-pradesh
raghu-rama-krishna-raju-on-liqour-brands-in-andhra-pradesh

ఆంధ్రాలో లిక్కర్‌ బ్రాండ్లు విచిత్రంగా ఉన్నాయని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. తెలంగాణలో దొరికే మద్యం రోజూ తాగితే 20 ఏళ్లకు లివర్‌ పాడవుతుందని నిపుణులు అంటున్నారని రఘురామకృష్ణరాజు అన్నారు. ఆంధ్రాలో దొరికే మద్యం తాగినవారు 2, 3 ఏళ్లకే హరీ అంటారని నిపుణులంటున్నారని పేర్కొన్నారు.

లీజుకు ఎవరు తీసుకున్నారోగానీ ఎస్పీవై రెడ్డి కర్మాగారంలో మద్యం బ్రాండ్లు తయారుచేస్తున్నారని రఘురామ కృష్ణరాజు అన్నారు. పలు రకాల మోడళ్లలో మద్యం బ్రాండ్లన్నీ ఒకేచోట తయారుచేస్తున్నారని ఆరోపించారు.

ఇదీ చదవండి: మూడు రాజధానుల కేసులపై ఇకపై రోజువారీ విచారణ!

ABOUT THE AUTHOR

...view details