తెలంగాణ

telangana

By

Published : Nov 23, 2019, 7:38 PM IST

ETV Bharat / state

ప్రిన్స్ మహేశ్​తో సహా నలుగురికి సీపీ గ్రీన్ ఛాలెంజ్

ఎంపీ సంతోష్ కుమార్ చేసిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన రాచకొండ సీపీ మహేష్ భగవత్ కమిషనర్ కార్యాలయంలో మూడు మొక్కలు నాటారు. అనంతరం మరో నలుగురికి ఛాలెంజ్​ విసిరారు.

మరో నలుగురికి గ్రీన్‌ ఛాలెంజ్‌ను చేసిన రాచకొండ సీపీ

రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ చేసిన గ్రీన్ ఛాలెంజ్​లో భాగంగా ఈరోజు సీపీ మహేష్ భగవత్ రాచకొండ కమిషనర్ కార్యాలయంలో మూడు మొక్కలను నాటి మరో నలుగురికి ఛాలెంజ్ చేశారు. అందులో భాగంగా సినీ హీరో మహేష్ బాబు, నటుడు షియాజీ షిండే, పుణె పోలీసు కమిషనర్ వెంకటేశం, పోచారం ఇన్ఫోసిస్ డీసీ హెడ్ మనిషా సాబులకు ఛాలెంజ్​ విసిరారు.

ఈ ఛాలెంజ్​ను వెంటనే స్వీకరించిన నటుడు షియాజీ షిండే మంబైలోని ఆర్ఐ కాలనీలో రేపు మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. మిగతా ముగ్గురు కూడా ఈ గ్రీన్ ఛాలెంజ్​ను స్వీకరించనున్నారని మహేష్ భగవత్ తెలిపారు.

మరో నలుగురికి గ్రీన్‌ ఛాలెంజ్‌ను చేసిన రాచకొండ సీపీ

ఇదీ చూడండి : వంతెన పై నుంచి కారుపై పడిన మరోకారు.. మహిళ మృతి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details