హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ విద్యార్థి గర్జన శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య హాజరయ్యారు. ఇంజినీరింగ్, పీజీ వృత్తివిద్యా కోర్సుల్లో చదువే బీసీ విద్యార్థులకు పూర్తిగా బోధన రుసుం చెల్లించాలని డిమాండ్ చేశారు. పాత బోధన రుసుం బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని కోరారు.
ఆదాయం 5 లక్షలు పెంచాలి
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలన్నారు. పేద కులాలకు చెందిన విద్యార్థులందరికీ ఫీజు రియెంబర్స్మెంట్ ఇవ్వాలని కోరారు. ఆదాయ పరిమితి 2 లక్షల నుంచి ఏపీ ప్రభుత్వం పెంచినట్లుగా 5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. దరఖాస్తు చేసుకున్న వారందరికీ విదేశి విద్య ఉపకారవేతనాలు అందించాలని డిమాండ్ చేశారు.
బోధన రుసుం పూర్తిగా చెల్లిచండి: ఆర్.కృష్ణయ్య ఇవీ చూడండి : 'ముస్లిం, మైనార్టీలు ఏ ఆధారాలు చూపించాలి'