తెలంగాణ

telangana

ETV Bharat / state

నిరుపేదలకు అండగా నిలుస్తున్న పుట్టా రామకృష్ణ - పేదలకు ఆర్థిక సాయం అందజేసిన పుట్టా రామకృష్ణ

లాక్​డౌన్​ కారణంగా ఉపాధి కోల్పోయిన నిరుపేద ప్రజలకు స్ఫూర్తి గ్రామీణ అభివృద్ధి సంస్థ వ్యవస్థాపకులు పుట్టా రామకృష్ణ అండగా నిలుస్తున్నారు. భాగ్యనగరంలో ఆకలితో అలమటించే వారికి ఆహరంతో పాటు ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నారు.

putta ramakrishna helps to poor people
నిరుపేదలకు అండగా నిలుస్తున్న పుట్టా రామకృష్ణ

By

Published : May 24, 2021, 1:04 PM IST

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సంఘ సేవకుడు, స్ఫూర్తి గ్రామీణ అభివృద్ధి సంస్థ వ్యవస్థాపకులు పుట్టా రామకృష్ణ ఆకలితో అలమటించే వారికి ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. అలాగే నిత్యావసర సరుకులు, ఆర్థిక సాయాన్ని అందజేస్తూ... తన ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. పక్షవాతంతో బాధపడుతున్న ఓ సినీ కార్మికుని వైద్య ఖర్చుల నిమిత్తం 5 వేల రూపాయలను ఇచ్చారు.

అలాగే రహ్మత్‌నగర్​లో అంజలి నాట్యాలయ పిల్లలకు ఉచిత భోజన వసతి కల్పించారు. ప్రతిరోజు వారికి ఆహారం అందించాలనే ఉద్దేశంతో డబ్బును కూడా ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇలాంటి సమయాల్లో నిరుపేద ప్రజలకు... దాతలు చేతనైనా సాయం చేయాలని పుట్టా రామకృష్ణ కోరారు.

ఇదీ చదవండి :రెండు రోజులుగా కఠినంగా లాక్​డౌన్​ అమలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details