తెలంగాణ

telangana

చిరంజీవి బ్లడ్​బ్యాంక్​ ముందు ఉయ్యాలవాడ వంశీయుల ధర్నా

By

Published : Jun 30, 2019, 4:43 PM IST

హైదరాబాద్​లోని చిరంజీవి బ్లడ్​బ్యాంక్​ ముందు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశీయులు ఆందోళన చేశారు. రామ్​చరణ్​ను కలిసేందుకొచ్చిన తమను అనుమతించడం లేదంటూ ఉయ్యాలవాడ వంశీయులు ధర్నాకు దిగారు.

చిరంజీవి బ్లడ్​బ్యాంక్​ ముందు ఉయ్యాలవాడ వంశీయుల ధర్నా

సైరా చిత్ర నిర్మాత రామ్​చరణ్​ను కలిసేందుకొచ్చిన తమను అడ్డుకున్నారంటూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశీయులు ధర్నాకు దిగారు. చిరంజీవి బ్లడ్​బ్యాంక్​ ముందు ఆందోళన చేపట్టారు. ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి చరిత్ర ఆధారంగా సైరా సింహారెడ్డి చిత్రం తెరకెక్కుతున్న విషయం విధితమే.

ఉయ్యాలవాడ వంశీయులకు సాయం చేస్తానని గతంలో రామ్​చరణ్​ ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. తిరుపతి ప్రసాద్​ అనే వ్యక్తి తమను రామ్​చరణ్​ వద్దకు తీసుకెళ్లినప్పుడు తమకు సాయం చేస్తానని హామీ ఇచ్చారన్నారు. కాని ఇప్పుడు తమను రామ్​చరణ్​ను కలిసేందుకు అనుమతించడం లేదంటూ ఆరోపించారు. తమచేత డాక్యుమెంట్లపై సంతకాలు చేయించుకున్నారని ఇప్పుడు మాట తప్పారంటూ నిరసిసన తెపిలారు. చిరంజీవి, రామ్​చరణ్​పై తమకు నమ్మకముందని కాని వారి మేనేజర్లే అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

చిరంజీవి బ్లడ్​బ్యాంక్​ ముందు ఉయ్యాలవాడ వంశీయుల ధర్నా

ఇదీ చూడండి: దాడి చేసింది కోనేరు కృష్ణారావు: డీఎఫ్‌వో రాజారమణరెడ్డి

ABOUT THE AUTHOR

...view details