హైకోర్టు న్యాయవాదులు వామన్ రావు, నాగమణిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని లాయర్లు డిమాండ్ చేశారు. ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. హత్యకు నిరసనగా సికింద్రాబాద్ సివిల్ కోర్టు ఎదుట న్యాయవాదులు రెండో రోజు ఆందోళనకు దిగారు.
ఏలా రక్షణ కల్పిస్తారు?..
రాష్ట్రంలో న్యాయవాదులకే రక్షణ లేనప్పుడు సామాన్యులకు ఏ విధంగా రక్షణ కల్పిస్తారని తెలంగాణ పోలీసులను ప్రశ్నించారు. న్యాయవాదులను కాపాడడంలో, నిందితులను పట్టుకోవడంలో విఫలమయ్యారని ఆరోపించారు.