తెలంగాణ

telangana

ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా ప్రొఫెసర్ నాగేశ్వర్ నామినేషన్

మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీకి స్వతంత్ర అభ్యర్థిగా ప్రొఫెసర్ నాగేశ్వర్ నామినేషన్ దాఖలు చేశారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం నుంచి తన మద్దతుదారులతో కలిసి వెళ్లి నామినేషన్ వేశారు.

By

Published : Feb 20, 2021, 1:35 PM IST

Published : Feb 20, 2021, 1:35 PM IST

ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా ప్రొఫెసర్ నాగేశ్వర్ నామినేషన్
ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా ప్రొఫెసర్ నాగేశ్వర్ నామినేషన్

హైదరాబాద్, మహబూబ్​నగర్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆచార్య నాగేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియం నుంచి తన మద్దతుదారులతో కలిసి... లిబర్టీలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.

ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా సంఘాలు ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పట్టబధ్రుల సమస్యలపై పోరాడేందుకు తనకు మరోసారి అవకాశం ఇవ్యాలని కోరారు. అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిదిగా ఓటర్లను అభ్యర్థించారు.

ABOUT THE AUTHOR

...view details