తెలంగాణ

telangana

'ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలకు అనుమతివ్వాలి'

కరోనా పరీక్షలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రేవేటు ఆస్పత్రులు అసోసియేషన్​ సభ్యులు మంత్రి ఈటలను కోరారు. ఈ మేరకు హైదరాబాద్​ బీఆర్కే భవన్​లో వినతి పత్రాన్ని అందజేశారు. రోగులకు ఎలాంటి చికిత్స ఇవ్వాలన్నా ముందుగా కొవిడ్​ పరీక్షలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్యులకిచ్చినట్టే తమకు 50 లక్షల ఇన్సూరెన్స్​ కల్పించాలని డిమాండ్​ చేశారు.

By

Published : May 15, 2020, 4:30 PM IST

Published : May 15, 2020, 4:30 PM IST

'ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలకు అనుమతివ్వాలి'
'ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలకు అనుమతివ్వాలి'

కరోనా మహమ్మారి ఎలాంటి లక్షణాలు లేకుండా కూడా వ్యాపిస్తున్నందున ప్రైవేటు ఆస్పత్రుల్లో సైతం పరీక్షలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ... ప్రైవేటు ఆస్పత్రుల అసోసియేషన్ సభ్యులు బీఆర్కే భవన్​లో మంత్రి ఈటలను కోరారు. ఈ మేరకు మంత్రికి వినతిపత్రాన్ని అందజేశారు. ఇకపై రోగులకు ఎలాంటి చికిత్స ఇవ్వాలన్నా ముందుగా కరోనా పరీక్షలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కాబట్టి ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనాకు సంబంధించి ర్యాపిడ్ టెస్ట్​లు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.

'ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలకు అనుమతివ్వాలి'

కొన్ని ప్రైవేటు ఆస్పత్రులను పలు కారణాలతో సీజ్ చేస్తున్నారని ఇది సరికాదని ప్రైవేటు ఆస్పత్రుల ప్రతినిధులు పేర్కొన్నారు. ఇక ఆస్పత్రుల్లో పనిచేసే స్టాఫ్ పీఎఫ్ కట్టాలని కేంద్రం నుంచి నోటీస్​లు వచ్చాయని తెలిపారు. దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం చొరవతీసుకుని పీఎఫ్ కట్టకుండా సహాయం చేయాలని కోరారు. ప్రభుత్వ వైద్యులకు ఇచ్చినట్టే తమకు 50 లక్షల ఇన్సూరెన్స్ కల్పించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:కరోనా మృతుల పక్కనే సాధారణ రోగులకు చికిత్స!

ABOUT THE AUTHOR

...view details