సూపర్ స్టార్ మహేశ్బాబు విజయవాడలో సందడి చేశారు. ఎం.జీ రోడ్డులోని ఓ నగల దుకాణాన్ని ఆయన ప్రారంభించారు. మహేశ్ను చూసేందుకు అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. విజయవాడతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న మహేశ్....నూతన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' సంక్రాంతికి విడుదల కాబోతుందని వెల్లడించారు. అభిమానుల తాకిడి దృష్ట్యా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
విజయవాడలో హీరో మహేశ్బాబు సందడి - విజయవాడలో ప్రిన్స్ మహేశ్బాబు సందడి
విజయవాడలో ప్రిన్స్ మహేశ్ బాబు సందడి చేశారు. ఓ నగల దుకాణాన్ని ప్రారంభించిన మహేష్...నగరంతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

విజయవాడలో హీరో మహేశ్బాబు సందడి