తెలంగాణ

telangana

ETV Bharat / state

Modi: 'వెళ్లండయ్యా.. వెళ్లి కాశీ చూసి రండి.. ఎంతో అభివృద్ధి చేశాం'

Modi Breakfast for BJP MPs: దిల్లీ లోక్​కళ్యాణ్ మార్గ్​లోని తన నివాసంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, కర్ణాటక రాష్ట్రాల భాజపా ఎంపీలకు ప్రధాని నరేంద్రమోదీ అల్పాహార విందు ఇచ్చారు. ఇటీవల ఆయన కాశీ పర్యటన విశేషాలను ఎంపీలకు వివరిస్తూ.. అందరూ కాశీ చూసి రావాలని మోదీ సూచించారు.

By

Published : Dec 16, 2021, 9:15 AM IST

Modi Breakfast for BJP MPs
నరేంద్రమోదీ

Modi Breakfast for BJP MPs: కాశీలో ఎంతో అభివృద్ధి చేశామని, ఎంపీలు చూసిరావాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించారు. దిల్లీ లోక్‌కల్యాణ్‌ మార్గ్‌లోని తన నివాసంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల భాజపా ఎంపీలకు బుధవారం ఆయన అల్పాహార విందు ఇచ్చారు. ఇటీవలి తన కాశీ పర్యటన విశేషాలను ఈ సందర్భంగా వారికి వివరించారు.

వారణాసిలో చేపడుతున్న పనులను చూసి, అనంతరం మీ ప్రాంతాల వారు అక్కడకు వెళ్లి చూసేలా ప్రోత్సహించాలని సూచించారు. సమావేశంలో తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు బండి సంజయ్‌, ధర్మపురి అర్వింద్‌, సోయం బాపురావు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి, సి.ఎం.రమేష్‌, టి.జి.వెంకటేష్‌, జి.వి.ఎల్‌.నరసింహారావు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:వారణాసిలో వైభవంగా గంగా హారతి- ప్రధాని హాజరు

ABOUT THE AUTHOR

...view details