ఇప్పటికే జీహెచ్ఎంసీ, పోలీస్, ట్రాఫిక్, సానిటేషన్, ఎలక్ట్రిసిటీ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రపతి నిలయం పరిసరాలు బారికేడ్లు, పూల మొక్కలు, అలంకరణలతో ముస్తాబయ్యాయి. తొమ్మిది రోజుల విడిదిలో రాష్ట్రపతి మధ్యలో కేరళ వెళ్లనున్నారు. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కూడా ఏర్పాట్ల గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రేపు హైదరాబాద్కు రాష్ట్రపతి.. సిద్ధమైన బొల్లారం... - రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పర్యటన
హైదరాబాద్ బొల్లారం రాష్ట్రపతి నిలయం పరిసరాలు ముస్తాబయ్యాయి. రామ్నాథ్ కోవింద్ శీతకాల విడిది కోసం ఈ నెల 20న రాష్ట్రానికి రానున్నారు. 9రోజుల పాటు రాష్ట్రపతి పర్యటన సాగనుంది.

రేపు హైదరాబాద్కు రాష్ట్రపతి..
రేపు హైదరాబాద్కు రాష్ట్రపతి.. సిద్ధమైన బొల్లారం...
డిసెంబర్ 22న గవర్నర్... రాష్ట్రపతి గౌరవార్థం రాజ్ భవన్లో విందు ఏర్పాటు చేశారు. శీతాకాల విడిది అనంతరం ఈనెల 28 మధ్యాహ్నం... రామ్నాథ్ కోవింద్ దిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. ఈ పర్యటన నేపథ్యంలో రాష్ట్రపతి నిలయం వద్ద తొమ్మిది రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
ఇవీ చూడండి: జనవరి 1 నుంచి కార్గో సేవలు అందించనున్న ఆర్టీసీ
Last Updated : Dec 19, 2019, 8:47 PM IST