తెలంగాణ

telangana

ETV Bharat / state

నిమ్స్​లో కూనంనేనిని పరామర్శించిన నేతలు

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా హైదరాబాద్ నిమ్స్​లో నిరవధిక దీక్ష చేస్తున్న కూనంనేని సాంబశివరావును చాడ వెంకట్​రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, ఆర్ కృష్ణయ్య, వీహెచ్ పరామర్శించారు.

By

Published : Oct 28, 2019, 6:33 PM IST

నిమ్స్​లో కూనంనేనిని పరామర్శించిన నేతలు

ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా నిరవధిక దీక్షకు దిగిన కూనంనేని సాంబశివరావు అరెస్టును కార్మిక ఐకాస, సీపీఐ నేతలు తీవ్రంగా ఖండించారు. ఆయన దీక్షకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి సంఘీభావం తెలిపారు. నిమ్స్​లో ఉన్న కూనంనేనిని మాజీ ఎంపీ వి.హనుమంతురావు, మోత్కుపల్లి నర్సింహులు, ఆర్.కృష్ణయ్య పరామర్శించారు. అర్ధరాత్రి తర్వాత దీక్ష చేసున్న కూనంనేనిని అక్రమంగా అరెస్ట్ చేశారని వీహెచ్ అన్నారు. అనుమతున్నా లేకున్నా ఈ నెల 30న బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు. ఆర్టీసీ కార్మికులకు జీతాల్లేకుండా చేసి ముఖ్యమంత్రి మతిలేని రాజ్యమేలుతున్నారని.. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని మోత్కుపల్లి నర్సింహులు కోరారు. ఆర్టీసీ సమ్మెతో ప్రజా జీవితం స్తంభించిపోయిందని ఆర్.కృష్ణయ్య అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

నిమ్స్​లో కూనంనేనిని పరామర్శించిన నేతలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details