తెలంగాణ

telangana

'సకలజనుల సమ్మె స్ఫూర్తిని యాది చేసుకుంటున్నం'

సకలజనుల సమ్మెకు నేటితో పదేళ్లు పూర్తైన సందర్భంగా అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కు అమరవీరుల స్థూపం వద్ద నేతలు నివాళులర్పించారు. నాటి తెలంగాణ ఉద్యమకారులతో కలిసి అమరులను స్మరించుకొని, సకలజనుల సమ్మె స్ఫూర్తిని యాది చేసుకుంటున్నామన్నారు.

By

Published : Sep 12, 2021, 1:25 PM IST

Published : Sep 12, 2021, 1:25 PM IST

Updated : Sep 12, 2021, 2:27 PM IST

political-leaders-pay-tribute-to-martyrs-at-gun-park-in-hyderabad-on-the-occasion-of-the-tenth-anniversary-of-the-sakala-janula-samme
political-leaders-pay-tribute-to-martyrs-at-gun-park-in-hyderabad-on-the-occasion-of-the-tenth-anniversary-of-the-sakala-janula-samme

ప్రత్యేక తెలంగాణ కోసం సకల జనుల సమ్మె నిర్వహించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా పలువురు నాయకులు గన్‌పార్కు వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. అప్పటి జేఏసీ ఛైర్మన్‌, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, ఎంపీ కోమటరెడ్డి వెంకటరెడ్డి, శాసన మండలి మాజీ ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ తదితరులు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. ఉద్యోగులు తమ ఉద్యోగాలను ఫనంగా పెట్టి..సకల జనుల సమ్మెలో పాల్గొనడం, ఇతర అన్ని వర్గాలు కూడా కలిసి రావడంతోనే తాము 42 రోజులపాటు సకల జనుల సమ్మెను చేయగలిగామని నాటి జేఎసీ ఛైర్మన్‌ కోదండరాం అభిప్రాయపడ్డారు.

ఉద్యోగ, కార్మిక సంఘాలతో నెల రోజులపాటు సుదీర్ఘంగా చర్చించిన తరువాతనే ఈ సమ్మెకు ప్రణాళిక రూపకల్పన చేసినట్లు ఆయన వివరించారు. 11వందల మంది తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు తీసుకున్నారని...ఇంత పెద్ద పోరాటం గుర్తుండేందుకు ఇవాళ సెలవు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరాం కాని...తమ వినతులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాల నాయకుడిగా స్వామిగౌడ్​పై దాడి జరిగినా వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్లామని...రాజకీయ పార్టీలకు అతీతంగా అందరు కలిసి రావడంతోనే సమ్మె విజయవంతమైందని...ప్రత్యేక రాష్ట్రాన్ని అందించి స్వయం పాలనను నెరవేర్చిన ఇవాళ్టికి... ప్రత్యేకత ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం శెలవు ప్రకటించాలని డిమాండ్​ చేశారు.

'సకలజనుల సమ్మె స్ఫూర్తిని యాది చేసుకుంటున్నాం

అన్ని వర్గాలు అంత శాంతియుతంగా చేరి... కొట్లాడిన సందర్భం మరొకటి లేదు. తెలంగాణ సమ్మె అంటే కేవలం కేసీఆర్​ దీక్షను చూపించడం మాకు సమ్మతం కాదు. కొట్లాడినాం కదా..! కీర్తి కిరీటాలు అడగలేదు, కుర్చీలు అడగలేదు. మా శ్రమను గుర్తు చేసుకోండి... మాపాత్రను గుర్తు చేసుకోండని మాత్రమే అడుగుతున్నాం. ఆ అడిగే హక్కు మాకు ఉంది. మేం కోరుకున్న తెలంగాణ వస్తాదని మా ఆశ. ప్రజాస్వామికమైన తెలంగాణ కావాలి. మేం ఏదైతే తెలంగాణ కావాలని కోరుకున్నామో.. దానికోసం నిలబడతాం, కొట్లాడతాం. అది మాత్రం మేము ప్రకటించదలచుకున్నాం.మళ్లాకూడా కొట్లాడాల్సిన పరిస్థితి రావడమే మేము బాధపడుతున్నాం.- ప్రొ.కోదండరాం, తెజస అధ్యక్షుడు.

సకల జనుల సమ్మెలో పాల్కొన్న అందరి కార్మికులకు పాదాభివందనం. ఈ గడ్డమీద పుట్టిన ప్రతి బిడ్డ కూడా ప్రపంచమంతా గుర్తించే విధంగా సకల జనులు ఆ సమ్మెలో పాల్గొన్నారు. ఆఖరుకు తెలంగాణ వచ్చిన తర్వాత మరళా అదే దొరతనాన్ని బయటపెట్టి కాళ్లు మొక్కించుకునే దొరతనానికి దిగజారిపోయాం మనమంతా.-స్వామి గౌడ్​, భాజపా నాయకుడు.

తెలంగాణ వచ్చి ఇన్నేళ్లైనా ఏ ఒక్క వర్గం కూడా సంతోషం లేదు. ఈరోజు కొన్ని కుటుంబాల కోసమే తెలంగాణ, సకల జనుల సమ్మె, 1100 మంది అమర వీరులు ప్రాణత్యాగం చేసినట్టుంది. కడుపు తరుక్కుపోతోంది. పదవులకు, ప్రాణాలకు, ఉద్యోగాలకు తెగించి పోరాటం చేస్తే... మళ్లా ఇవాళ మన బతుకులు అదే అవతుంది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఏమిచ్చింది. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు. కానీ 450 మందికి ఉద్యోగాలిచ్చి ఇంతే లెక్క అని చెప్పారు. ఆఖరుకు 15ఏళ్ల కిందున్న టెక్నికల్​ అసిస్టెంట్​ ఉద్యోగులను 17వేల మందిని పీకేశారు. -కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, కాంగ్రెస్​ ఎంపీ.

నిజంగానే తెలంగాణ వస్తే సామాజిక తెలంగాణ వస్తుందంటే దళితులను మోసం చేసే నియంతృత్వ తెలంగాణ వచ్చింది. తండ్రీ కొడుకుల పాలనైంది. అందరికీ ఉద్యోగాలొస్తాయనుకుంటే... దేశవ్యాప్తంగా 15 శాతం నిరుద్యోగం ఉంటే.. రాష్ట్రంలో 29శాతం నిరుద్యోగం ఉంది. ఇవాళ ఇక్కడికి అన్ని పార్టీల నాయకులు వచ్చారు కానీ... ఎవరైతే లాభపడ్డ పార్టీ నాయకులు ఉన్నారో ఒక్కరు కూడా రాలేదు. -కొండా విశ్వేశ్వర్​ రెడ్డి, మాజీ ఎంపీ.

ఇదీ చూడండి:REVANTH REDDY: గజ్వేల్ 'దళిత గిరిజన ఆత్మగౌరవ సభ'ను సక్సెస్ చేయాలి

Last Updated : Sep 12, 2021, 2:27 PM IST

ABOUT THE AUTHOR

...view details