తెలంగాణ

telangana

ETV Bharat / state

పేదల ఇళ్లకు రాజకీయ ‘రంగు’! - telangana news

ఏపీలోని కర్నూలు నగర శివారులో మొదటి విడతగా 5వేల మంది లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించారు. డిసెంబరు 25 నాటికే వీటిని పంపిణీ చేయాల్సి ఉన్నా, పనులు పూర్తికాలేదు. ప్రజాప్రతినిధుల సూచనల మేరకు గుత్తేదారులు ఏ రంగు కావాలంటే ఆ రంగు వేస్తారని, ఇందులో తమ ప్రమేయం లేదని ఓ అధికారి వివరించారు.

Political color for poor homes
పేదల ఇళ్లు

By

Published : Dec 31, 2020, 10:13 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు నగర శివారు జగన్నాథగట్టు ప్రాంతంలో పేదలకిచ్చేందుకు 10 వేల ఇళ్లను నిర్మిస్తున్నారు. తెదేపా హయాంలో లోగడ ఇక్కడే నిర్మించిన ఇళ్లకు లేత పసుపు వర్ణం ఉంది. వైకాపా హయాంలో ప్రస్తుతం నిర్మాణం తుది దశలో ఉన్న ఇళ్లకు ముదురు నీలం, తెలుపు రంగులు వేస్తున్నారు.

ఇలా ఒకే ప్రాంగణంలో వేర్వేరు రంగులతో నివాస సముదాయాలు కనిపిస్తున్నాయి. మొదటి విడతగా ఐదువేల మంది లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించారు. డిసెంబరు25 నాటికే వీటిని అందించాల్సి ఉన్నా, పనులు పూర్తికాలేదు. ప్రజాప్రతినిధుల సూచనలతో గుత్తేదారులు రంగులు వేస్తారని, ఇందులో తమ ప్రమేయం లేదని ఓ అధికారి వివరించారు.

ఇదీ చదవండి:ఎర్నాకులంలో మొదటి షిగెల్లా కేసు

ABOUT THE AUTHOR

...view details