జనతా కర్ఫ్యూలో భాగంగా హైదరాబాద్ నగరంలో పోలీసులు వాహనదారులకు అవగాహన కల్పించారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పలు వాహనాలను ఆపి.. కరోనా నివారణ కోసం ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ పాటించాలని సూచించారు. అనవసరంగా బయట తిరగొద్దని ఆదేశించారు.
'అనవసరంగా బయట తిరిగితే ఊరుకోం' - updated news on Janatha curfew
రాజధాని నగరంలోని అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. జనతా కర్ఫ్యూ పట్ల వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు.
!['అనవసరంగా బయట తిరిగితే ఊరుకోం' police officials conduct awareness programme on Janatha curfew to motorists](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6503513-351-6503513-1584869228099.jpg)
జనతా కర్ఫ్యూ పట్ల వాహనదారులకు అవగాహన
ఈ సందర్భంగా ద్విచక్ర వాహనం నడుపుతున్న ఓ మైనర్ బాలుడ్ని అదుపులోకి తీసుకున్నారు. బండి సీజ్ చేసి, జ్యువైనల్ హోమ్కు తరలించారు.
జనతా కర్ఫ్యూ పట్ల వాహనదారులకు అవగాహన