తెలంగాణ

telangana

ETV Bharat / state

రాచకొండ కమిషనరేట్​కు ఒక్కరోజు కమిషనర్​ - make a wish full fill in rachakonda

రాచకొండ కమిషనరేట్‌కు ఒక్కరోజు కమిషనర్ వచ్చారు. క్యాన్సర్​తో​ బాధపడుతున్న ఓ బాలిక కోరిక తీర్చేందుకు పోలీసులు ముందుకొచ్చారు. ఒక్కరోజు కమిషనర్‌గా అవకాశం కల్పించారు సీపీ మహేష్​ భగవత్​. మేక్ ఏ విష్ ఫౌండేషన్ ద్వారా ఇది సాధ్యమయ్యింది.

రాచకొండ కమిషనరేట్​కు ఒక్కరోజు కమిషనర్​

By

Published : Oct 29, 2019, 11:08 PM IST

లుకేమియా వ్యాధితో పోరాడుతున్న ఓ బాలిక కలను రాచకొండ సీపీ మహేష్​ భగవత్​ నిజం చేశారు. మంగళ వారం ఒక్కరోజు కమిషనర్​గా బాధ్యతలు నిర్వహించే అవకాశం కల్పించారు. అల్వాల్ సుచిత్రకు చెందిన 17ఏళ్ల రమ్య ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. చదువులో అందరికన్న ముందుండే రమ్య... గత కొంత కాలంగా బ్లడ్ క్యాన్సర్​ 'లుకేమియా'తో బాధపడుతోంది. చిన్ననాటి నుంచి పోలీస్​ ఆఫీసర్​ కావాలని కలలుగన్న తమ బిడ్డ కోరికను మేక్​ ఏ విష్​ సంస్థ ప్రతినిధులకు చెప్పారు రమ్య తల్లిదండ్రులు. సంస్థ ప్రతినిధులు రాచకొండ సీపీ మహేష్ భగవత్​ను కలిసి బాలిక విషయం తెలిపారు. రమ్య పరిస్థితి తెలుసుకున్న సీపీ... బాలిక కలను నిజం చేయడానికి ఒప్పుకున్నారు. మంగళవారం ఒక్కరోజు కమిషనర్​గా బాధ్యతలు స్వీకరించిన రమ్య పోలీసులకు తగు సూచనలు చేసింది. పెట్రోలింగ్​ని పెంచాలని... శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అదుపులోకి రావడానికి కృషి చేయాలని తెలిపింది. తమ బిడ్డ కలను నెరవేర్చిన పోలీసు అధికారులకు రమ్య తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. రమ్య త్వరగా కోలు కోవాలని....పోలీస్ శాఖ అండగా ఉంటుదని సీపీ మహేష్​ భగవత్​ తెలిపారు.

రాచకొండ కమిషనరేట్​కు ఒక్కరోజు కమిషనర్​

ABOUT THE AUTHOR

...view details