తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రావణి కేసు: పోలీసుల అదుపులో సాయికృష్ణ, దేవరాజ్ - బుల్లితెర నటి శ్రావణి కేసులో విచారణ వేగవంతం

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో విచారణ కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు... ఆరోపణలు ఎదుర్కొంటున్న సాయికృష్ణ, దేవరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

శ్రావణి ఆత్యహత్య కేసు దర్యాప్తు వేగవంతం
శ్రావణి ఆత్యహత్య కేసు దర్యాప్తు వేగవంతం

By

Published : Sep 13, 2020, 9:09 PM IST

Updated : Sep 13, 2020, 9:54 PM IST

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో విచారణ కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు... ఆరోపణలు ఎదుర్కొంటున్న సాయికృష్ణ, దేవరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి సినీ నిర్మాత అశోక్‌రెడ్డికి నోటీసులు జారీచేశారు. నటి ఆత్మహత్య కేసులో అన్ని కోణాల్లో ఆధారాలు సేకరించిన పోలీసులు... మృతురాలి తల్లిదండ్రుల నుంచి కూడా వాంగ్మూలం రికార్డు చేశారు.

ఇప్పటివరకు బయటికి వచ్చిన ఆడియోలో వాస్తవాలను పరిశీలించి... సాయికృష్ణ, దేవరాజ్‌లను ఒకేచోట ఉంచి విచారిస్తున్నారు. ఓ హోటల్‌ వద్ద సాయికృష్ణ... శ్రావణిని బెదిరించడంపై కేసునమోదు చేయనున్నారు.

ఇదీ చూడండి: కుటుంబసభ్యులే వేధిస్తున్నారని చెప్పింది: దేవరాజ్

Last Updated : Sep 13, 2020, 9:54 PM IST

ABOUT THE AUTHOR

...view details