తెలంగాణ

telangana

ETV Bharat / state

వైకాపా ఎంపీ​పై పోస్టులు పెట్టిన యువతికి నోటీసులు - case bookes on undavalli anusha news

ఆంధ్రప్రదేశ్​లోని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్​పై సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు చేసిన ఉండవల్లి అనూష అనే యువతిపై పోలీసు కేసు నమోదైంది. మూడు రోజుల్లో విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు.

police case  anusha
వైకాపా ఎంపీ భరత్​పై పోస్టులు... చేసిన వారికి నోటీసులు

By

Published : May 24, 2020, 5:41 PM IST

సామాజిక మాధ్యమంలో వైకాపా ఎంపీ మార్గాని భరత్​కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన ఉండవల్లి అనూష అనే యువతికి పోలీసులు నోటీసులు పంపారు. కార్పొరేట్​ సామాజిక బాధ్యత నిధుల విషయంలో ఎంపీ మార్గాని భరత్​ను సోషల్ మీడియా వేదికగా యువతి ప్రశ్నించింది. ఈ వీడియోలపై రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలోని బొమ్మూరు పోలీసుస్టేషన్​లో స్థానిక వైకాపా నాయకులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనూషకు నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. సైబర్ నేరం 41(a) సెక్షన్ కింద యువతికి నోటీసులు అందించారు.

ABOUT THE AUTHOR

...view details