తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏడేళ్ల బాలుడి హత్యకేసును చేధించిన పోలీసులు... - MUHAMMAD YASIN

హైదరాబాద్​ పహాడి షరీఫ్​ ప్రాంతానికి చెందిన ఏడేళ్ల బాలుడు మహ్మద్ యాసిన్ హత్యకేసును పోలీసులు చేధించారు. ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఎట్టకేలకు కిరాతకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

By

Published : May 13, 2019, 10:11 PM IST

బాలాపూర్ పోలీస్టేషన్ పరిధిలో కలకలం రేపిన ఏడేళ్ల బాలుడి హత్య కేసును పోలీసుల చేధించారు. హైదరాబాద్​లోని పహాడిషరీఫ్ ముస్తఫానగర్​లో ఈనెల 8న రాత్రి ఇంటి నుంచి షాపుకు వెళ్తుతున్న ఏడేళ్ల మహ్మద్ యాసిన్​కు మాయమాటలు చెప్పిన ఒమర్..పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళాడు. బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన ఒమర్..యాసిన్ ప్రతి ఘటించగా బండరాయితో తలపై, పొట్టపై మోది కిరాచకంగా హత్య చేశాడు.
బాలుడి అలికిడి విని స్థానికులు కేకలు వేయగా ఒమర్ అక్కడినుంచి పరారయ్యాడు. అప్పటికే బాలుడు మృతి చెందాడు. బస్తీ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి చెప్పులు, సీసీటీవీ ఫుటేజ్, కాలనీ వాసులు ఇచ్చిన సమాచారం ఆధారంగా హుడా కాలనీకి చెందిన నిందితుడు ఒమర్​ను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details