తెలంగాణ

telangana

ETV Bharat / state

దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభం

పోలీసు ఉద్యోగార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. పోలీసులు ఈసారి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు.

By

Published : Feb 12, 2019, 5:11 AM IST

దేహదారుఢ్య పరీక్షలు

దేహదారుఢ్య పరీక్షలు
రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. ఉదయమే అభ్యర్థులు కేంద్రాలకు చేరుకున్నారు. ఈసారి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పారదర్శకంగా దేహదారుఢ్య పరీక్షలు చేపడుతున్నామని పోలీసులు పేర్కొన్నారు. 100, 800 మీటర్ల పరుగు, లాంగ్​ జంప్, హై జంప్, షాట్​పుట్ విభాగాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు.

అంబర్‌పేటలో సీపీఎల్‌ మైదానంలో ఉదయం 9గంటలకు మొదలుకావాల్సిన దేహదారుఢ్య పరీక్షలు మధ్యాహ్నం తర్వాత ప్రారంభమవటంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయం 6 గంటలకే వివిధ జిల్లాల నుంచి వచ్చామని.. ఒంటి గంట వరకు కూడా మొదలుపెట్టలేదని వాపోయారు.

అన్ని ఈవెంట్ల తర్వాత 800మీటర్ల పరుగును చివరలో నిర్వహించడం వల్ల నిరసించి వెనుకబడిపోతున్నామని అభ్యర్థులు పేర్కొన్నారు. ఈసారి ఆర్‌ఎఫ్‌ఐడీ అనే కొత్త విధానంలో ఈవెంట్స్​ నిర్వహిస్తుండటాన్ని అభ్యర్థులు స్వాగతించారు.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 18వేల428 కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకుగాను 2లక్షల 60వేల మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు

ABOUT THE AUTHOR

...view details