తెలంగాణ

telangana

ETV Bharat / state

గోషామహల్​లో గంట వ్యవధిలో 55 వాహనాలు సీజ్ - Hyderabad lock down2021

రాష్ట్రంలో లాక్​డౌన్ పటిష్ఠంగా అమలవుతోంది. హైదరాబాద్​ గోషామహల్ కూడలి వద్ద ఏసీపీ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Hyderabad lockdown, vehicle checking in goshamahal
హైదరాబాద్​లో లాక్​డౌన్, గోషామహల్​లో వాహన తనిఖీలు

By

Published : May 25, 2021, 1:32 PM IST

హైదరాబాద్​లో పోలీసులు లాక్​డౌన్​ను పటిష్ఠంగా అమలు చేస్తున్నారు. గోషామహల్ కూడలి వద్ద ఏసీపీ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటలు దాటిన తర్వాత రోడ్లపైకి వస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై షాహినాజ్ గంజ్ పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. అనుమతి లేకుండా రోడ్లపైకి వచ్చిన వాహనాలను జప్తు చేసి కేసు నమోదు చేస్తున్నారు. గంట వ్యవధిలో సుమారు 55 వాహనాలు సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details