లాక్డౌన్ వేళ సికింద్రాబాద్లోని బోయిన్పల్లి పోలీసులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న వృద్దురాలిని చేరదీసిన విజయకుమార్ ,నజీర్ పాషా అనే కానిస్టేబుళ్లు తమ చేతులతో ఆహారాన్ని తినిపించారు. ఆనంతరం ఆమెకు దుస్తులు అందించారు. వృద్దురాలు మామూలు స్థితికి చేరుకున్నాక వివరాలు అడిగి బోయిన్పల్లిలో ఉంటోన్న ఆమె తమ్ముడి వద్దకు చేర్చారు.
అపస్మారక స్థితిలో ఉన్న వృద్దురాలిని చేరదీసిన పోలీసులు - వృద్దురాలిని చేరదీసిన పోలీసలు
అపస్మారక స్థితిలో ఉన్న ఓ వృద్దురాలిని చేరదీసి సికింద్రాబాద్ పోలీసుల తమ మానవత్వాన్ని చాటుకున్నారు. తమ చేతులతో ఆమెకు ఆహారాన్ని తినిపించి ఆదర్శంగా నిలిచారు. ఈ విషయం తెలుకున్న ఉన్నతాధికారులు సాయం చేసిన సిబ్బందిని అభినందించారు.

వృద్దురాలిని చేరదీసిన పోలీసలు
నగరంలోని బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న విజయకుమార్, నజీర్ పాషాలకు ఓ వృద్దురాలు అపస్మారక స్థితిలో ఉన్నట్లు సమాచారం అందింది. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమె పరిస్థితిని గుర్తించి ఆహారాన్ని, బట్టలను అందించారు. వివరాలు తెలుసుకుని బోయిన్పల్లిలో ఉంటోన్న ఆమె తమ్ముడి వద్దకు చేర్చారు. సకాలంలో స్పందించి వృద్దురాలిని ఆదుకోవడంతో పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.
ఇదీ చదవండి:పర్యావరణ ఉద్యమకారుడు బహుగుణ మృతి