హైదరాబాద్ గోల్కొండ పోలీస్స్టేషన్ పరిధిలోని మోతే దర్వాజలో జరిగిన మహిళ హత్య కేసులో పోలీసులు నిందితుని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు చేపడుతున్నారు. ప్రధానంగా కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. అయితే నిందితుడు బషీర్కు ఇద్దరు భార్యలని... హత్యకు గురైన ఆమె రెండో భార్యని పోలీసులు తెలిపారు.
'మహిళ హత్య కేసు దర్యాప్తునకు ప్రత్యేక బృందాలు'
హైదరాబాద్ గోల్కొండ పోలీస్స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన భార్యను గొంతుకోసి హతమార్చాడు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుని కోసం ప్రత్యేక బృందాలు ద్వారా గాలిస్తున్నారు.
'మహిళ హత్య కేసు దర్యాప్తునకు ప్రత్యేక బృందాలు'
ఇదీ చూడండి : మోతీ దర్వాజాలో భార్య గొంతు కోసిన భర్త