ఏపీలోని ప్రకాశం జిల్లాలో తెదేపా చేపట్టిన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా పార్టీ అధినేత చంద్రబాబు... బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
చంద్రబాబు బస్సుయాత్రలో జేబు దొంగల చేతివాటం - Pocket pirate's handgun
మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర సందర్భంగా జేబు దొంగలు చేతివాటం ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో యాత్ర ప్రారంభోత్సవంలో కార్యక్రమంలో రెచ్చిపోయారు. యాత్రకు హాజరైన వారిలో కొందరి నగదు, చరవాణిని అపహరించారు.
![చంద్రబాబు బస్సుయాత్రలో జేబు దొంగల చేతివాటం Pick Pocketing](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6134452-1039-6134452-1582173021822.jpg)
Pick Pocketing
ఇదే అదనుగా భావించిన జేబు దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించి... ఐదుగురు వ్యక్తుల నుంచి దాదాపు రూ. 89, 900 నగదు, ఒక చరవాణి దొంగిలించారు. మరో వ్యక్తి జేబును కత్తిరించేందుకు ప్రయత్నించగా దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఘటనపై విచారణ జరిపి బాధితులకు నగదును తిరిగి అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.
చంద్రబాబు బస్సుయాత్రలో జేబు దొంగల చేతివాటం