వినియోగదారులు కడుతున్న పన్నులతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయని.. వారి హక్కులను కాపాడాల్సిన బాధ్యత కూడా వారిపైనే ఉందని ప్రణాలిక సంఘం వైస్ ఛైర్మన్ వినోద్కుమార్ అన్నారు. వినియోగదారుల హక్కులపై ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాలని... తద్వారా ప్రజల్లో నమ్మకం ఏర్పడి వినియోగదారుల హక్కులపై అవగాహన వస్తుందని పేర్కొన్నారు.
జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని... హైదరాబాద్ బషీర్బాగ్లో తెలంగాణ వినియోగదారుల ఫోరమ్ ఆధ్వర్యంలో " కరోనా కష్ట కాలంలో అలుపెరుగని సేవకుల అభినందన " సత్కార సభను నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా వినోద్ కుమార్ హాజరయ్యారు.