తెలంగాణ

telangana

ETV Bharat / state

'జీవవైవిధ్యంపై ఆధారపడే.. భవిష్యత్తు వ్యవసాయం' - hyderabad latest news

భవిష్యత్తులో వ్యవసాయం జీవవైవిధ్యం ఆధారంగా ఉండబోతుందని... ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వెల్చాల ప్రవీణ్‌రావు తెలిపారు. ఈ ఏడాది జూన్​ నాటికి వర్సిటీ ప్రాంగణంలో బయోడైవర్సిటీ పార్క్​ను పూర్తిస్థాయులో అభివృద్ధి చేస్తామని అన్నారు. సీఎం కేసీఆర్​ పుట్టినరోజు సందర్భంగా హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.

pjtsau Vice Chancellor said Biodiversity Park will be fully developed in 2021
'భవిష్యత్తులో వ్యవసాయం జీవవైవిధ్యం ఆధారంగా ఉండబోతుంది'

By

Published : Feb 18, 2021, 11:41 AM IST

హైదరాబాద్​ రాజేంద్రనర్​లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఈ ఏడాది జూన్, జులై నాటికి వ్యవసాయ బయో డైవర్సిటీ పార్క్​ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని... వర్సిటీ ఉపకులపతి డాక్టర్ వెల్చాల ప్రవీణ్‌రావు తెలిపారు. ఆ బాధ్యతలను రిజిస్ట్రార్‌కు అప్పగించినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.

మొక్కలు నాటుతున్న వర్సీటీ వీసీ ప్రవీణ్​రావు

భవిష్యత్తులో వ్యవసాయం జీవవైవిధ్యం ఆధారంగా ఉండబోతుందని వీసీ తెలిపారు. ఈ వర్షాకాలం నుంచి వర్సిటీలో చేరిన ప్రతి విద్యార్థి విధిగా ఒక మొక్క నాటే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. బయో డైవర్సిటీ హెరిటేజ్ వాక్ సంస్కృతిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్‌.సుధీర్‌కుమార్, పాలక మండలి సభ్యులు, ఇతర శాస్త్రవేత్తలు, అధ్యాపకులు పాల్గొని మొక్కలు నాటారు.

ఇదీ చదవండి: 'న్యాయవాద దంపతుల హత్యలో తెరాస నేతల ప్రమేయం'

ABOUT THE AUTHOR

...view details