బడ్జెట్లో పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం పెంచటంతో వాటి ధరలు పెరగనున్నాయి. ఈ నిర్ణయంతో వాహనదారులపై అదనపు భారం పడనుంది. పెరిగిన ధరలు శనివారం ఉదయం 6 గంటల నుంచి అమలులోకి రానున్నాయి. ఈ బడ్జెట్లోనైనా చమురు వినియోగదారులకు ఊరట కలుగుతుందనుకుంటే.. రేట్లు పెంచటం ఏంటని వాహన చోదకులు ప్రశ్నిస్తున్నారు. ధరలు అదుపు చేయటం మాని.. వినియోగదారుల నడ్డి విరిసేలా చర్యలున్నాయని ప్రజలు మండిపడుతున్నారు.
పెట్రోల్ ధర మళ్లీ పెరిగింది బాబోయ్.. - petrole price
కేంద్ర బడ్జెట్ సాధారణ పౌరుల నడ్డి విరగ్గొంట్టిందంటూ వాహన చోదకులు గగ్గోలు పెడుతున్నారు. చమురు ధర నానాటికీ పైపైకి పోతుంటే జేబులో డబ్బులు ఆవిరైపోతున్నాయంటూ వాపోతున్నారు. శనివారం నుంచి పెట్రోలు ధర మళ్లీ పెరగనున్నందున వాహనదారులు పెట్రోలు బంకులకు క్యూ కడుతున్నారు.

పెట్రోల్ ధర మళ్లీ పెరిగింది బాబోయ్..