తెలంగాణ

telangana

ETV Bharat / state

మాంసం దుకాణాల వద్ద బారులుతీరిన జనం.. కనిపించని భౌతికదూరం - Crowd at meat shops in hyderabad

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తుండటంతో.. మినహాయింపు సమయంలో జనం భారీగా రోడ్లపైకి వచ్చారు. ఉదయం నుంచే రోడ్లు, దుకాణాల వద్ద గుమిగూడారు. ఆదివారం కావడంతో కూరగాయలు, మాంసం, మందు దుకాణాలకు పోటెత్తారు. భౌతిక దూరం, వైరస్​ భయం మరచి కొనుగోళ్లకు ఎగబడ్డారు.

మాంసం దుకాణాల వద్ద బారులుతీరిన జనం
మాంసం దుకాణాల వద్ద బారులుతీరిన జనం

By

Published : May 23, 2021, 10:05 AM IST

మాంసం దుకాణాల వద్ద బారులుతీరిన జనం

హైదరాబాద్‌ నగరంలో నిత్యావసరాల కోసం జనం బారులు తీరారు. భౌతిక దూరం పాటించకుండా దుకాణాల వద్ద గుమిగూడారు. మాంసం, కూరగాయలు, నిత్యావసరాల కొనుగోళ్ల వద్ద గంటల తరబడి వేచి ఉన్నారు.

ఆదివారం కావడంతో దాదాపు అన్ని ప్రాంతాల్లో జనాలు అధికంగా చేపలు, మాంసం కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా మాంసం దుకాణాల వద్ద రద్దీ పెరిగింది. పలుచోట్ల వ్యక్తిగత దూరం పాటించకుండానే కొనుగోళ్లు జరుగుతున్నాయి. లాక్​డౌన్ భయంతో జనాలు ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో రహదారులు రద్దీగా దర్శనమిస్తున్నాయి. దుకాణాల ఎదుట బారులు తీరిన ప్రజలకు పోలీసులు సామాజిక దూరం పాటించేలా సూచిస్తున్నారు.

మందుకోసం బారులు..

మరోవైపు ఉప్పల్, రామంతాపూర్, ఘట్‌కేసర్, బోడుప్పల్‌లో మద్యం దుకాణాల ఎదుట మందుబాబులు బారులుతీరారు. ఉదయం 6 గంటల నుంచే లైన్లలో నిల్చున్నారు. భౌతిక దూరం మరచి.. మందు కోసం వేచిచూస్తున్నారు.

ఇదీ చూడండి: పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద భారీగా నిలిచిన వాహనాలు

ABOUT THE AUTHOR

...view details