దేశవిభజన సమయంలో కూడా ప్రజలు ఎలా ఇబ్బందులు పడ్డారో.. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వలసకార్మికులకు న్యాయం జరగకపోతే తాను ఆమరణ దీక్షకు దిగనున్నట్లు పీసీసీ మాజీ అద్యక్షుడు వి.హనుమంతురావు హెచ్చరించారు. మోదీ, కేసీఆర్లు ఇద్దరు వలసకార్మికుల విషయంలో పూర్తిగా వైఫల్యం చెందారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ కేవలం ప్రెస్ కాన్ఫరెన్స్లకే పరిమితం అవుతున్నారని అన్నారు. వలస కూలీలకు నిల్వ నీడ లేకపోగా, కనీసం తినేందుకు తిండి లేదని ద్వజమెత్తారు.
'సీఎం కేసీఆర్ ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలి' - ghandhi bhavan latest news today
లాక్డౌన్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వలస కార్మికులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేకపోయారని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
!['సీఎం కేసీఆర్ ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలి' pcc chief uttam kumar reddy comment on CM KCR must take appropriate action at migrant workers in telangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7238783-828-7238783-1589725422491.jpg)
'ఇప్పటికైనా సీఎం కేసీఆర్ తగిన చర్యలు తీసుకోవాలి'
గాంధీభవన్లో ఉదయం నుంచి నిరసన దీక్ష నిర్వహిస్తున్న వి.హనుమంతురావు చేత నిమ్మరసం ఇచ్చి ఉత్తమ్కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలు దీక్ష విరమింపచేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతురావు అరెస్టు, ఆయనపై పెట్టిన సెక్షన్లు అత్యంత దారుణమన్నారు. వలస కార్మికుల సమస్యపై ఆందోళన, నిరసన చేసిన హనుమంతరావుని అభినందనిస్తున్నట్లు ఉత్తమ్ తెలిపారు.
'ఇప్పటికైనా సీఎం కేసీఆర్ తగిన చర్యలు తీసుకోవాలి'
ఇదీ చూడండి :'ప్రైవేటు వ్యక్తులను ఆదుకునేందుకే కేంద్రం ప్యాకేజీ తెస్తోంది'