తెలంగాణ

telangana

By

Published : Nov 6, 2019, 12:06 PM IST

Updated : Nov 6, 2019, 12:47 PM IST

ETV Bharat / state

ప్రాణభయంతో.. ఛాంబర్ చుట్టూ తాడు కట్టించిన తహసీల్దార్!!

కర్నూలు జిల్లా పత్తికొండ తహసీల్దార్ ఉమామహేశ్వరి తీసుకున్న నిర్ణయం.. అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్ హత్య ఘటనతో భయపడిన ఆమె.. అలా చేసి వార్తల్లో నిలిచారు.

mro

ప్రాణభయంతో.. ఛాంబర్ చుట్టూ తాడు కట్టించిన తహసీల్దార్!!

ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా పత్తికొండ తహసీల్దార్ ఉమామహేశ్వరి.. కార్యాలయంలో తన ఛాంబర్‌ చుట్టూ తాడు కట్టుకున్నారు. కార్యాలయానికి వచ్చిన వారు ఆ తాడు చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. అర్జీలు ఇచ్చేవారు తాడు బయటనుంచే ఇవ్వాలని, ఎవరూ లోపలికి రాకుండా చూడాలని సిబ్బందిని తహసీల్దార్​ ఆదేశించారు. ఈ పరిణామంపై ఆమెను ఆరాతీయగా... హైదరాబాద్‌ శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి సజీవదహనం తర్వాత భయానికి గురైనట్లు చెప్పారు. ముందు జాగ్రత్త చర్యగా తాడుతో రక్షణ ఏర్పాటు చేసుకున్నానని బదులిచ్చారు.

Last Updated : Nov 6, 2019, 12:47 PM IST

ABOUT THE AUTHOR

...view details