తెలంగాణ

telangana

ఆక్సిజన్ సిలిండర్​తో పోలింగ్​ కేంద్రానికి - బతికున్నంత వరకు ఓటేస్తానంటున్న శేషయ్య

By ETV Bharat Telangana Team

Published : Nov 30, 2023, 2:05 PM IST

Patient With Oxygen Cylinder Casted Vote Telangana 2023 : తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మహిళలు, వృద్ధులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందుకు వస్తున్నారు. కొంతమంది యువత మాత్రం ఓటింగ్​లో పాల్గొనడానికి బద్ధకిస్తున్నారు. అలాంటి వారికి శేషయ్య ఆదర్శంగా నిలుస్తున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నా.. లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రానికి వచ్చి మరీ ఓటు వేశారు.

Telangana Elections 2023
Telangana Health Issues Voters Inspiring Youth Voters

Patient With Oxygen Cylinder Casted Vote Telangana 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. యువత, మహిళలతోపాటు వృద్ధులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు సైతం పోలింగ్ బూత్​లకు వచ్చి తమ ఓటు వేసి అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

Telangana Polling 2023 :హైదరాబాద్​లోని గచ్చిబౌలిలో నివాసం ఉంటున్న 75 ఏళ్ల శేషయ్య తీవ్రమైన లివర్ సిరోసిస్​తో బాధపడుతున్నారు. అయినా సరే బతికున్నంత వరకు ఓటు వేయాలన్న పట్టుదలతో ఆయన ఆక్సిజన్ సిలిండర్​తో పోలింగ్ కేంద్రానికి వచ్చారు. గచ్చిబౌలిలోలని జీపీఆర్ఏ క్వార్టర్స్​లోని పోలింగ్ బూత్​లో శేషయ్య తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఓటు వేయడం ఓ పౌరుడిగా తన బాధ్యత అని తెలిపారు. 1966 నుంచి తాను మిస్ అవ్వకుండా ఓటు వేస్తున్నానని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details