దిల్లీలో జరిగిన అవాంఛనీయ సంఘటనలు దేశ ప్రజలందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాయని... తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ అన్నారు. ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావంగా హైదరాబాద్ హిమయత్ నగర్లోని సంఘం కార్యాలయంలో పశ్య పద్మ ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు.
దేశవ్యాప్తంగా రైతులు కొనసాగిస్తున్న పోరాటాలను నీరుగార్చడానికి కొందరు నాయకులు పథకం పన్నారని ఆరోపించారు. అసాంఘిక శక్తులను ప్రేరేపించి ట్రాక్టరు ర్యాలీని ఛిన్నాభిన్నం చేయడానికి కేంద్ర ప్రభుత్వ నేతలు, ఆర్ఎస్ఎస్ వ్యక్తులు కుట్ర చేశారని విమర్శించారు.