తెలంగాణ

telangana

ETV Bharat / state

నెలలోనే 50 లక్షల సభ్యత్వాల నమోదు

సీఎం కేసీఆర్ చేస్తున్న పనులు, పథకాలను ప్రజలు ప్రశంసిస్తున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి తెలిపారు. ఇప్పటికే రూ.15 కోట్ల సభ్యత్వ రుసుముు వసూలైందని పేర్కొన్నారు.

By

Published : Jul 26, 2019, 7:09 PM IST

50 లక్షల సభ్యత్వాల నమోదు


నెలాఖరులోపు పార్టీ సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పార్టీ శ్రేణులను ఆదేశించారు. పార్టీ సభ్యత్వ నమోదుపై తెలంగాణ భవన్​లో 5 గంటలపాటు సమీక్ష నిర్వహించిన ఆయన... నియోజకవర్గాల వారీగా సభ్యత్వ తీరు గురించి బాధ్యులను అడిగి తెలుసుకున్నారు. నెలలోనే 50 లక్షల సభ్యత్వ నమోదు కావడం దేశ రాజకీయాల్లో అరుదని పేర్కొన్నారు. సభ్యత్వ రుసుం కింద 15 కోట్ల రూపాయలు పార్టీ ప్రధాన కార్యాలయానికి అందాయని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వెల్లడించారు. తెరాస సభ్యత్వం తీసుకున్న వారికి బీమా సదుపాయం కూడా కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.

50 లక్షల సభ్యత్వాల నమోదు

ABOUT THE AUTHOR

...view details