తెలంగాణ

telangana

By

Published : Apr 7, 2019, 9:47 PM IST

ETV Bharat / state

వచ్చేది సమాఖ్య కూటమే: అసదుద్దీన్

కేంద్రంలో వచ్చేది సమాఖ్య కూటమేనని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసి ధీమా వ్యక్తం చేశారు. మంత్రి మల్లారెడ్డితో సమావేశమైన ఆయన మల్కాజిగిరి అభ్యర్థి రాజశేఖర్ రెడ్డికి మద్దతు ప్రకటించారు.

owisi

కేంద్రంలో కాంగ్రెస్, భాజపాయేతర సమాఖ్య కూటమి అధికారంలోకి రానున్నదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. తెరాస ఎంపీలు గెలిస్తే తెలంగాణకు లాభం చేకూరుతుందన్నారు. సికింద్రాబాద్ బోయినపల్లిలో మంత్రి మల్లారెడ్డితో భేటీ అయ్యారు. మల్కాజిగిరి తెరాస ఎంపీ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డికి మజ్లిస్ మద్దతు ఉంటుందన్నారు. తెలంగాణ భవిష్యత్ కోసం రాజశేఖర్ రెడ్డికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

మల్కాజిగిరి తెరాస అభ్యర్థికి ఓటేయండి

ABOUT THE AUTHOR

...view details