డిగ్రీ చివరి సెమిస్టర్ పరీక్షల ఫలితాలను ఉస్మానియా విశ్వవిద్యాలయం వెల్లడించింది. డిగ్రీ చివరి సెమిస్టర్లో 67.23 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. కరోనా ప్రత్యేక జాగ్రత్తలతో సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 18 వరకు డిగ్రీ చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ చివరి సెమిస్టర్కు 69 వేల 809 మంది హాజరు కాగా.. 46 వేల 935 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 75.34 శాతం.. బాలురు 57.67 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. బీఎస్సీలో 24 వేల 797 మంది హాజరవగా.. 16 వేల 758 మంది, బీకాంలో 37 వేల 140 మంది హాజరు కాగా.. 23 వేల 339 మంది ఉత్తీర్ణత సాధించారు.