ఓయూ హాస్టళ్లలో విద్యుత్ సరఫరా, మంచినీటి సరఫరా పునరుద్ధరించాలని కోరుతూ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. ఇందుకోసం ఓయూ రోడ్లు దిగ్బంధం చేయటంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. కొవిడ్ - 19తో ఉస్మానియాలోని వసతి గృహాలను ఖాళీ చేయాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. అయినా విద్యార్థులు హాస్టళ్లు ఖాళీ చేయకపోవటం వల్ల విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేశారు.
కరోనా ఎఫెక్ట్: ఓయూలో విద్యార్థుల ధర్నా
కొవిడ్ -19 ప్రభావం అన్నీ రంగాలపై పడుతోంది. వ్యాపార సంస్థల నుంచి మొదలుకొని విద్యాసంస్థల వరకు ఈ వైరస్ ప్రభావానికి గజగజా వణికిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఓయూ హాస్టల్ వసతిగృహాన్ని యాజమాన్యం మూసివేసింది. దీనిని పునరుద్ధరించాలని కోరుతూ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు.
కరోనా ఎఫెక్ట్: ఓయూలో విద్యార్థుల ధర్నా
అసహనానికి గురైన విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. చీకట్లో మగ్గుతోన్న తమ గోడు ఎవరూ పట్టించుకోవటం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:సీఏఏ వ్యతిరేక తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం
Last Updated : Mar 18, 2020, 7:38 AM IST