హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం పీజీ వసతిగృహం వద్ద విషాదం చోటుచేసుకుంది. జాగ్రఫీ విద్యార్థి నరసయ్య రసాయనం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని తరలించేందుకు సిద్ధమయ్యారు. బాధితులకు న్యాయం చేయాలంటూ వసతి గృహం ఎదుట విద్యార్థులు బైఠాయించారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీరికి మద్దతు తెలిపారు. రిజిస్ట్రార్ వచ్చి హామీ ఇచ్చేంత వరకు మృతదేహాన్ని తరలించేందుకు విద్యార్థులు అంగీకరించలేదు.
ఓయూ విద్యార్థి ఆత్మహత్య.. వీహెచ్ సహా విద్యార్థుల అరెస్ట్ - ou students arrest
హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జాగ్రఫీ విద్యార్థి నరసయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని.. అంతవరకు మృతదేహాన్ని తరలించవద్దంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వీరికి వీహెచ్ మద్దతు తెలిపారు.
ఓయూ వసతి గృహంలో విద్యార్థి అనుమానాస్పద మృతి
పరిస్థితి ఉద్రిక్తంగా మారడం వల్ల.. వీహెచ్ సహా ఆందోళన చేస్తున్న విద్యార్థులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని భారీ బందోబస్తు మధ్య మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఇవీచూడండి:వివాహేతర సంబంధం.. కడతేర్చిన ప్రియుడు