తెలంగాణ

telangana

By

Published : Apr 16, 2020, 8:43 PM IST

ETV Bharat / state

ఎంసెట్, నీట్ పరీక్షలకు ఆన్​లైన్​లో ఉచిత శిక్షణ

ఎంసెట్, జేఈఈ, నీట్​కు సిద్ధమవుతున్న విద్యార్థులకు.. ఉచిత ఆన్​లైన్​ శిక్షణను అందిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్​ తెలిపారు. ఇంటర్​బోర్డు వెబ్​సైట్​ ద్వారా రిజిస్టరై విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

online coaching for eamcet, neet, jee exams
ఎంసెట్, నీట్ పరీక్షలకు ఆన్​లైన్​లో ఉచిత శిక్షణ

ఎంసెట్, జేఈఈ, నీట్​కు సిద్ధమవుతున్న ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు... ఉచిత ఆన్​లైన్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్ కోరారు. లాక్​డౌన్ కారణంగా ఈ ఏడాది వీడియోలు, ఆన్​లైన్ పరీక్షల ద్వారా కోచింగ్​కు ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు.

ఏప్రిల్ 20 నుంచి రోజూ, వారం వారీ, గ్రాండ్ పరీక్షలు ఆన్​లైన్​లో నిర్వహించి.. విశ్లేషించనున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్ బోర్డు వెబ్​సైట్​లోని లింక్ ద్వారా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వెల్లడించారు. రోజూ 40 ప్రశ్నలతో పరీక్ష ఉంటుందని.. గ్రాండ్ టెస్టు 160 ప్రశ్నలతో నిర్వహిస్తామని చిత్ర రామచంద్రన్ పేర్కొన్నారు. ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా కూడా శిక్షణ పరీక్షల్లో పాల్గొనవచ్చునన్నారు.

ఇదీ చదవండిఃఈటీవీ కథనానికి స్పందన.. బుడగ జంగాల కూలీలకు సాయం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details