తెలంగాణ

telangana

ETV Bharat / state

పరీక్ష రాసేందుకని వెళ్లి.. అనంతలోకాలకు... - హైదరాబాద్​లో పరీక్ష రాసేందుకని వెళ్లి... అనంతలోకాలకు వెళ్లాడు

పరీక్ష రాసేందుకని ఇంటి నుంచి కళాశాలకు బయలుదేరిన ఓ విద్యార్థి దురదృష్టవశాత్తు ఆర్టీసీ బస్సు కిందపడి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్ ఉప్పల్​లో చోటుచేసుకుంది.

పరీక్ష రాసేందుకని వెళ్లి... అనంతలోకాలకు
పరీక్ష రాసేందుకని వెళ్లి... అనంతలోకాలకు

By

Published : Dec 4, 2019, 3:56 PM IST

హైదరాబాద్‌ ఉప్పల్‌ సర్కిల్‌ లక్ష్మినారాయణ కాలనీకి చెందిన ప్రవీణ్‌ డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. పరీక్ష రాసేందుకు స్నేహితుడి ద్విచక్రవాహనం తీసుకుని బయలుదేరాడు. రామంతాపూర్‌ పెద్ద చెరువు వద్దకు రాగానే ఆర్టీసీ బస్సును ఓవర్​టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. దురదృష్టవశాత్తు ద్విచక్రవాహనం అదుపు తప్పి బస్సు చక్రాల కింద పడిపోయాడు. విషయం గమనించిన స్థానికులు పక్కనే ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తలిరించారు. అప్పటికే ప్రవీణ్ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. పరీక్ష రాసేందుకు వెళ్లిన ప్రవీణ్‌ ప్రమాదంలో మృతి చెందాడని తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

పరీక్ష రాసేందుకని వెళ్లి... అనంతలోకాలకు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details