తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్సు, ద్విచక్రవాహనం ఢీ... మహిళ మృతి

మలక్​పేట్​లోని నల్గొండ క్రాస్ ​రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని, ప్రైవేటు బస్సు ఢీకొట్టడం వల్ల... ఘటన స్థలంలోనే ఓ మహిళ మృతి చెందింది.

By

Published : Nov 2, 2019, 8:48 PM IST

బస్సు, ద్విచక్రవాహనం ఢీ... మహిళ మృతి

మలక్​పేట్​లోని నల్గొండ క్రాస్ ​రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న మహిళను ఓ ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. సైదాబాద్‌లో నివాసముంటున్న కావ్య(20) అనే యువతి స్కూటీపై తన సోదరుడు సాయితో కలిసి అల్వాల్‌లో బ్యాంకు పరీక్ష రాసేందుకు శనివారం ఉదయం బయల్దేరారు. నల్గొండ చౌరస్తా వద్దకు రాగానే రహదారి గుంతలున్నాయని బైకు వేగం తగ్గించగా వెనుకనుంచి అదే రహదారిపై వస్తున్న ఓ ప్రైవేటు బస్సు వీరి వాహనాన్ని ఢీకొంది. కావ్య అక్కడికక్కడే మృతిచెందగా సాయికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బస్సు, ద్విచక్రవాహనం ఢీ... మహిళ మృతి

ABOUT THE AUTHOR

...view details