తెలంగాణ

telangana

By

Published : Sep 25, 2020, 10:55 PM IST

ETV Bharat / state

ఏడో రోజు సతీమణులతో సూర్య, చంద్రప్రభ వాహనసేవలో విహరించిన శ్రీవారు

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆఖరి దశకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో ఏడో రోజున స్వామివారు ఉదయం సూర్యప్రభ, సాయంత్రం చంద్రప్రభ వాహన సేవలపై దర్శనమిచ్చారు. శనివారం నిర్వహించే సర్వభూపాల, అశ్వవాహన సేవలతో వాహన సేవలు ముగియనున్నాయి. ఆదివారం.. బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టం చక్రస్నానం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య మహల్‌ చక్రస్నానం నిర్వహించేందుకు తొట్టెను నిర్మిస్తున్నారు.

ఏడో రోజు సతీమణులతో సూర్య, చంద్రప్రభ వాహనసేవలో విహరించిన శ్రీవారు
ఏడో రోజు సతీమణులతో సూర్య, చంద్రప్రభ వాహనసేవలో విహరించిన శ్రీవారు

తిరుమలేశుడి బ్రహ్మోత్సవాలు ఆఖరి రోజుకు చేరుకున్నాయి. ఆరో రోజున ఉదయం స్వామి వారు సర్వాలంకారభూషితుడై చంద్రప్రభపై దర్శనమిచ్చారు. శంఖు, చక్రం, గ‌థ‌‌, అభ‌య‌హ‌స్తం ధ‌రించి చ‌తుర్భు‌జ కేశ‌వ‌మూర్తి అవతారంలో భక్తులను కటాక్షించారు.

ఏడో రోజు సతీమణులతో సూర్య, చంద్రప్రభ వాహనసేవలో విహరించిన శ్రీవారు

ఉదయం సూర్యప్రభ సేవ

ఉత్సవాల్లో ఏడో రోజున స్వామివారు ఉదయం సూర్యప్రభ, సాయంత్రం చంద్రప్రభ వాహన సేవపై దర్శనమిచ్చారు. కరోనా నిబంధనల మేరకు ఉత్సవాలను ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహిస్తున్న తితిదే.. పాత వెండి సూర్యప్రభ వాహనంపై సేవను నిర్వహించారు.

నూతన వాహనం పెద్దగా ఉన్నందున..

నూతన వాహనాన్ని ఆలయంలోకి తరలించగా.. మహద్వారం కంటే పెద్దదిగా ఉండటం వల్ల వీలు పడలేదు. ఫలితంగా పాత వాహనంపైనే స్వామివారు ఆశీనులై దర్శనమిచ్చారు.

రాత్రి వైభవంగా చంద్రప్రభ సేవ

శుక్రవారం రాత్రి నిర్వహించిన చంద్రప్రభ వాహన సేవ వైభవంగా సాగింది. చల్లని వెన్నెల కురిసే సమయంలో చంద్రప్రభను అధిరోహించిన శ్రీవారు.. వెన్నముద్ద కృష్ణుడి అవతారంలో భక్తులకు కన్నుల విందుగా దర్శనమిచ్చారు.

శనివారం సర్వభూపాల, అశ్వవాహన సేవ

శనివారం ఉదయం సర్వభూపాల, సాయంత్రం అశ్వవాహన సేవపై స్వామివారు విహరించనున్నారు. ఆదివారం చక్రస్నానం, ధ్వజారోహణం కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

ఇదీ చూడండి:రేపటి నుంచి ద్వారకా తిరుమలలో కల్యాణ మహోత్సవాలు

ABOUT THE AUTHOR

...view details