సీఎం కేసీఆర్ 67 వ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 17న హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో అధి శ్రవణ మహా రుద్రయాగం నిర్వహిస్తున్నట్లు... రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, అభివృద్ధి కోసం ఈ యాగాన్ని తలపెట్టినట్లు ఆయన చెప్పారు. దోమలగూడలో బ్రహ్మశ్రీ ఈశ్వర సురేష్ శర్మ తదితరులతో కలిసి మహా రుద్రయాగం గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు.
సీఎం కేసీఆర్ పుట్టినరోజున 'అధి శ్రవణ మహా రుద్రయాగం' - హైదరాబాద్ తాజా వార్తలు
ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ నెల 17న హైదరాబాద్లో అధి శ్రవణ మహా రుద్రయాగం నిర్వహిస్తున్నట్లు... రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. దోమలగూడలోని ఎన్టీఆర్ స్టేడియంలో మహా రుద్ర యాగం గోడ పత్రికను ఆవిష్కరించారు.
![సీఎం కేసీఆర్ పుట్టినరోజున 'అధి శ్రవణ మహా రుద్రయాగం' On the occasion of CM KCR's birthday 'Adhi Shravana Maha Rudra Yagam' in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10645431-15-10645431-1613456510319.jpg)
సీఎం కేసీఆర్ పుట్టినరోజున 'అధి శ్రవణ మహా రుద్రయాగం'
రాష్ట్రంలో ఎప్పుడు, ఎక్కడా జరగని విధంగా అధి శ్రవణ మహా రుద్రయాగాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ యాగానికి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలను ఆహ్వానించనున్నట్లు చెప్పారు. యాగం చేయడం వల్ల రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని అన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
ఇదీ చదవండి: కొండగట్టు అంజన్న దర్శనానికి బారులుతీరిన భక్తులు