తెలంగాణ

telangana

ETV Bharat / state

తిరుమలలో కార్తీక బ్రహ్మోత్సవాలు.. నవనీతకృష్ణునిలా పద్మావతీ దేవి - tirumala tirupathi devasthanam

తిరుమల తిరుపతి దేవస్థానంలో కార్తీక మాసం బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు తిరుచానూరు పద్మావతీ దేవి.. నవనీతకృష్ణుని అలంకారంలో చిన్నశేషవాహనంపై కొలువు దీరారు.

tirumala
తిరుమలలో కార్తీక బ్రహ్మోత్సవాలు.. నవనీతకృష్ణునిలా పద్మావతీ దేవి

By

Published : Nov 12, 2020, 2:00 PM IST

తిరుమలలో తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. తొలిరోజు నవనీతకృష్ణుని అలంకారంలో అమ్మవారు చిన్నశేష‌వాహ‌నంపై అభ‌య‌మిచ్చారు.

నవనీత కృష్ణుడిలా

కరోనా నేపథ్యంలో ఆలయ సమీపంలోని వాహ‌న మండ‌పంలో వాహనసేవను ఏకాంతంగా నిర్వహించారు. వాహనసేవలో తితిదే జీయర్‌ స్వాములు, ఈవో జ‌వ‌హ‌ర్‌రెడ్డి, జేఈవో బ‌సంత్‌కుమార్‌, బోర్డు సభ్యులు మురళీకృష్ణ, సీవీఎస్వో గోపినాథ్ జెట్టి తదితరులు పాల్గొన్నారు.

అమ్మవారికి వాహన సేవ

ఇదీ చదవండి:అవగాహనాలోపం.. భక్తులకు తప్పని ఇబ్బందులు

ABOUT THE AUTHOR

...view details