BJP Laxman Comments about GO 317: జీవో 317 పై పోరాటం ఆగదని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఉద్యోగులు, నిరుద్యోగులకు భరోసా కల్పించడానికే జాతీయ నేతలు రాష్ట్రానికి వస్తున్నారని తెలిపారు. ఉద్యోగులను సంప్రదించకుండా నాలుగు గోడల మధ్య జీవోను తీసుకువచ్చారని ఆరోపించారు. జీవో సవరించాలని ఆదివారం వరంగల్లో నిరసన చేపడుతున్నామని... ఇందులో అసోం ముఖ్యమంత్రి పాల్గొంటారని తెలిపారు. ప్రభుత్వం సవరించకపోతే పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు మాట్లాడారు.
జీవో 317 నుంచి దృష్టి మళ్లించడానికే భాజపా నేతలను నిర్భందాలకు గురి చేస్తున్నారు. భాజపా నాయకులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఆ జీవో సవరించే వరకు ఉద్యమం ఆగదు. ఉద్యోగులకు, నిరుద్యోగులకు భరోసా కల్పించడానికే జాతీయ నేతలు తెలంగాణకు వస్తున్నారు. 317 జీవో వల్ల 1969లో ఏర్పడిన పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకువస్తుంది.
-లక్ష్మణ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు