తెలంగాణ

telangana

ETV Bharat / state

NVSS Prabhakar allegations : అనిమీయా ముక్త్‌ భారత్​ను నీరు గారుస్తున్న ప్రభుత్వం

NVSS Prabhakar allegations: కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన అనిమీయా ముక్త్‌ భారత్​ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నీరు గారుస్తోందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆరోపించారు. వైద్య పరికరాలని సేకరించే టెండర్లలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు విరుద్ధంగా టీఎస్‌ఎంఐడీసీ వ్యవహరించిందని మండిపడ్డారు. మేక్‌ ఇన్‌ ఇండియాను తుంగలో తొక్కి ఇతర దేశాల నుంచి వైద్య పరికరాలు, మందులను దిగుమతి చేసుకున్నారని ధ్వజమెత్తారు.

By

Published : Jan 21, 2022, 2:03 PM IST

Updated : Jan 21, 2022, 2:33 PM IST

NVSS Prabhakar allegations,  anemia mukt bharat scheme
అనిమీయా ముక్త్‌ భారత్​ను నీరు గారుస్తున్న ప్రభుత్వం

NVSS Prabhakar allegations: దేశంలోని గర్భిణీలు, మహిళలకు హిమోగ్లోబిన్‌ పరీక్షలు నిర్వహించేందుకు ప్రవేశపెట్టిన అనిమీయా ముక్త్‌ భారత్‌ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం నీరుగారుస్తోందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్‌ మండిపడ్డారు. కోటి పది లక్షల మందుల స్ట్రిప్స్, వైద్య పరికరాలని సేకరించే టెండర్లలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు విరుద్ధంగా టీఎస్‌ఎంఐడీసీ వ్యవహరించిందని ఆరోపించారు. మేక్‌ ఇన్‌ ఇండియాను తుంగలో తొక్కి ఇతర దేశాల నుంచి వైద్య పరికరాలు, మందులను దిగుమతి చేసుకున్నారని జూమ్‌ వేదికగా నిర్వహించిన మీడియా సమావేశంలో ధ్వజమెత్తారు.

ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం రూ.రెండు కోట్లను స్వాహా చేసిందని ఆరోపించారు. ఈ కుంభకోణంపై విచారణ జరపాలని సీబీఐకి, విజిలెన్స్‌ కమిషన్‌కి లేఖ రాస్తున్నట్లు తెలిపారు. ముడుపులు ముట్టడంతోనే టెండర్లను రద్దు చేయడంలేదని విమర్శించారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖమంత్రి పాత్ర కూడా ఉందని ఆరోపించారు. తక్షణమే టెండర్లను రద్దు చేసి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

గర్భిణీలు, మహిళల్లో హిమోగ్లోబిన్ శాతాన్ని పరీక్షించేందుకు కేంద్రప్రభుత్వం చేపట్టిన అనిమీయా ముక్త్‌ భారత్‌ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం నీరు గారుస్తోంది. అర్బన్ హెల్త్ మిషన్, రూరల్ హెల్త్ మిషన్ అనే రెండు కూడా దీని పరిధిలోనే పని చేస్తాయి. గర్భిణీ స్త్రీల్లో రక్త హీనతను పరిశీలించి... వారిని ఆరోగ్యంగా ఉంచేందుకు మెడికల్ స్ట్రిప్స్​ను ఉపయోగిస్తారు. ఇది పూర్తిగా కేంద్రప్రభుత్వం సహకారంతో నడిచే ప్రత్యేక కార్యక్రమం. ఈ టెండర్లలో అనేక అవకతవకలు జరిగాయి. ఒకే కంపెనీకు ఫేవర్ చేసేలాగా తెరాస ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఎన్నో స్వదేశీ కంపెనీలు ఉన్నా కూడా... చైనా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మార్గదర్శకాలకు భిన్నంగా టీఎస్‌ఎంఐడీసీ వ్యవహరిస్తోంది.

- ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు

అనిమీయా ముక్త్‌ భారత్​ను నీరు గారుస్తున్న ప్రభుత్వం

ఇదీ చదవండి:కరోనా టెస్ట్​ల రేట్లు భారీగా తగ్గింపు- 50 రూపాయలకే...

Last Updated : Jan 21, 2022, 2:33 PM IST

ABOUT THE AUTHOR

...view details